తాప్సీపై కేసు.. ఆ దుస్తులే కొంప ముంచాయి..

by Vinod kumar |
తాప్సీపై కేసు.. ఆ దుస్తులే కొంప ముంచాయి..
X

దిశ, సినిమా: హీరోయిన్ తాప్సీ పన్నుపై కేసు నమోదైంది. తమ మనోభావాలను కించపరిచిందంటూ బీజేపీ ఎమ్మెల్యే మాలినీ గౌర్ కొడుకు ఏకలవ్య సింగ్ గౌర్ ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీసెంట్‌గా జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో లక్ష్మీ దేవీ పెండెంట్‌తో కూడిన గోల్డ్ నెక్లెస్ ధరించింది తాప్సీ. అసభ్యకరమైన అవుట్‌ఫిట్‌లో కావాలనే అమ్మవారి పెండెంట్ వేసుకుందని, ప్రణాళికాబద్ధంగా సనాతన ధర్మాన్ని కించపరిచిందని ఆరోపించిన గౌర్.. తక్షణమే దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. కాగా టాప్ టు బాటమ్ రెడ్ గౌన్ ధరించిన ఆమె.. క్లీవేజ్ షో చేయడం.. ఆ డ్రెస్‌లో అమ్మవారి పెండెంట్ ధరించడం ముమ్మాటికీ తప్పేనని అభిప్రాయపడ్డారు కొందరు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి : Shruti Haasan: ప్రియుడితో నగ్నంగా రొమాన్స్.. హద్దులు దాటిన శృతిహాసన్

Advertisement

Next Story

Most Viewed